భారతదేశం, ఫిబ్రవరి 3 -- విశాఖపట్నంలోని ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ అయిన గీతం యూనివర్సిటీ ఆధీనంలో ఉన్న 54.79 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించడం పెద్ద వివాదానికి దారితీసింది. దీనిపై వైసీపీ అధినేత జగన్ కూడా మాట్లాడారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రమబద్ధీకరణ కోసం నిర్ణయించిన ధరను సంస్థ చెల్లిస్తుందని గీతం విశ్వవిద్యాలయ అధ్యక్షుడు, టీడీపీ ఎంపీ శ్రీభరత్ అన్నారు.

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ భూ క్రమబద్ధీకరణ ప్రక్రియను మాజీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు రూ. 5,000 కోట్ల విలువైన 54.79 ఎకరాల ముఖ్యమైన భూమిని తన కుటుంబ సభ్యుడు శ్రీభరత్‌కు అప్పగించారని ఆరోపించారు.

'గత వైఎస్సార్‌సీపీ పాలనలో ఆక్రమణకు గురైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని కంచె వేశారు. కానీ ఇప్పుడు దానిని చంద్రబాబు కుటుంబ సభ్యునిక...