Andhrapradesh, సెప్టెంబర్ 10 -- ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో మూడు రోజులు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణశాఖ ప్రకటన విడుదల చేసింది. పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి.

రేపట్నుంచి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. తీరం వెంబడి గంటకు 40 -60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష...