Telangana, మే 18 -- రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు రాయితీలపై రుణ సదుపాయం అందించేందుకు ప్రభుత్వం. రాజీవ్ యువ వికాసం స్కీమ్ అమలు చేస్తోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకానికి అన్ని జిల్లాల నుంచి భారీగా అప్లికేషన్లు అందాయి. ఏకంగా 15 లక్షలకుపైగా అప్లికేషన్లు వచ్చాయి. అర్హతలకు తగ్గటుగా. అందుబాటులో ఉన్న యూనిట్లకు దరఖాస్తు చేసుకున్నారు.

మరోవైపు రాజీవ్ యువ వికాసం స్కీమ్ అర్హుల ఎంపిక ప్రక్రియపై తెలంగాణ సర్కార్ కసరత్తు కొనసాగుతోంది. ప్రస్తుతం మండల స్థాయిలో వెరిఫికేషన్ జరుగుతుండగా. ఆపై జిల్లా కమిటీలకు సిఫార్సు చేస్తున్నారు. ఆ తర్వాత అర్హుల జాబితాలను వెల్లడిస్తారు.

ఇదిలా ఉంటే అర్హుల ఎంపికలో బ్యాంకర్లు సిబిల్ స్కోర్ ను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. సిబిల్‌ స్కోర్ బాగుంటేనే స్కీమ్ కు అర్హత లభించే అవకాశం ఉంటుందన్న ...