భారతదేశం, ఫిబ్రవరి 21 -- ఆయేషా మీరా హత్య ఘటన... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. విజయవాడకు చెందిన బీ ఫార్మసీ విద్యార్థిని హత్య కేసులో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. కానీ చివరికి దోషులు ఎవరో తేలకుండానే.. కేసు క్లోజ్ అయిపోయింది. దీంతో సుమారు 18 ఏళ్ల పాటు సాగిన ఆయేషా మీరా కుటుంబ సభ్యుల న్యాయ పోరాటం అంతం లేకుండానే ముగిసింది.

ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు.. కోర్టులో దాఖలు చేసిన తుది నివేదిక (ఫైనల్ రిపోర్ట్)ను సీబీఐ కోర్టు ఆమోదించింది. నివేదికను పరిశీలించిన అనంతరం కేసును క్లోజ్ చేస్తూ శుక్రవారం ఆదేశాలిచ్చింది.

ఇక ఈ కేసులో దర్యాప్తులో భాగంగా... ఆయేషా మీరా మృతదేహానికి రెండవ సారి కూడా పోస్టుమార్టం నిర్వహించారు. కేసు క్లోజ్ చేసిన నేపథ్యంలో మరోవైపు తమ కుమార్తె శరీర అవశేషాలను అప్పగించాలని కోరుతూ ఆయేషా మీరా తల్లిదండ...