భారతదేశం, ఫిబ్రవరి 19 -- తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు అగ్రనేత, కార్యదర్శి దేవ్‌జీ సహా కీలక నేతలు ఈ ప్రాంతంలో ఉన్నారన్న పక్కా సమాచారంతో బలగాలు వెళ్లాయి. అగ్రనేతల కోసం 'ఆపరేషన్ కగార్-2'లో భాగంగా కూంబింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు అగ్ర నేతలు ఉన్నట్టుగా సమాచారం. ఆపరేషన్ కగార్ 2 పేరుతో కర్రెగుట్టలో భద్రతా బలగాల కూంబింగ్ చేస్తున్నాయి. మావోయిస్టు అగ్ర నేతలే టార్గెట్‌గా ఆపరేషన్ కగార్ 2 నడుస్తోంది. ఆపరేషన్ కగార్‌ డెడ్‌లైన్ ఇంకా 40 రోజులే మిగిలి ఉంది. దీంతో ఛత్తీస్‌గఢ్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలతో కూంబింగ్ చేస్తున్నాయి. 2 వేలకు పైగానే బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.

నక్సలిజాన్ని ...