భారతదేశం, ఫిబ్రవరి 20 -- రాష్ట్రంలో చలి తీత్రత తగ్గిపోయింది. మరోవైపు ఎండలు పెరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.

అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం...నైరుతి బంగాళాఖాతంపై ఉన్న అల్పపీడనం ఇవాళ బలహీనపడింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతోలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ - వాయువ్య దిశగా శ్రీలంక వైపు కదిలే అవకాశం ఉంది.

మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తువ వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ప్రస్తుతం ఇది కొనసాగుతుండగా.... ఈ ప్రభావంతో రాబోయే 48 గంటల్లో ఇదే ప్రాంతంపై అల్పపీడ...