Telangana,hyderabad, మే 17 -- రజతోత్సవ సభ నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొదట్లో సభ బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగించగా.ఆ తర్వాత అనూహ్యంగా పక్కకి తప్పుకున్నారు. ఆపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అన్నీ తానై వ్యవహరించారు. ఇదిలా ఉంటే మరోవైపు ఎమ్మెల్యే కవిత కూడా. కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవలే ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. భౌగోళిక తెలంగాణ మాత్రమే సాకారమైందని. సామాజిక తెలంగాణను సాధించుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సొంత పార్టీలోనే కాదు. రాజకీయవర్గాల్లోనూ తీవ్రస్థాయిలో చర్చకు దారి తీశాయి. దీంతో అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోందన్న డిస్కషన్ జోరుగా జరుగుతోంది.

అధికారం కోల్పోయిన తర్వాత.. కొద్దిరోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీ మళ్లీ లైన్ లోకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేకపోయ...