భారతదేశం, ఏప్రిల్ 6 -- జీ తెలుగు టీవీ ఛానెల్‍లో కొంతకాలంగా సీనియల్స్ సమయాల్లో మార్పులు జరుగుతున్నాయి. గత నెలలో కొన్ని సీరియల్స్ టైమ్స్ మారాయి. ఇప్పుడు మరోసారి మూడు సీరియళ్ల టెలికాస్ట్ ప్రసార సమయాలను జీ తెలుగు మారుస్తోంది. రేపటి (ఏప్రిల్ 7) నుంచి మూడు సీరియళ్ల టైమ్ ఛేంజ్ కానుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

జీ తెలుగులో ముక్కుపుడక, సీతే రాముడి కట్నం, చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియళ్ల టైమింగ్స్ రేపు ఏప్రిల్ 7 నుంచి మారనున్నాయి. ఇక నుంచి ముక్కుపుడక సీరియల్ మధ్యాహ్నం 12 గంటలకు సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారం కానుంది. ఒంటి గంట నుంచి టైమ్ 12కు ఛేంజ్ అయింది.

సీతే రాముడి కట్నం సీరియల్ ఏప్రిల్ 7 నుంచి మధ్యాహ్నం 3 గంటలకు జీ తెలుగులో టెలికాస్ట్ కానుంది. ఈ సిరీయల్ కూడా సోమవారం నుంచి శనివారం వరకు వస్తుంది. 12.30 నుంచి ఏకంగా 3 గంటలకు ఈ సీరియల్ మారిప...