భారతదేశం, ఏప్రిల్ 4 -- కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్​ సవరణ బిల్లు- 2025 పార్లమెంట్​లో గట్టెక్కింది! లోక్​సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించిన మరుసటి రోజు, గురువారం అర్థరాత్రి రాజ్యసభ సైతం దీనికి ఓకే చెప్పింది. ఫలితంగా రాష్ట్రపతి సంతకం అనంతరం ఈ బిల్లు చట్టంగా మారనుంది.

ఈ బిల్లును కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారం మధ్యాహ్నం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. గురువారం మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకు, దాదాపు 12 గంటలు రాజ్యసభలో వక్ఫ్​ సవరణ బిల్లుపై తీవ్ర చర్చ జరిగింది. అనంతరం జరిగిన ఓటింగ్​లో బిల్లుకు అనుకూలంగా 128 మంది సభ్యులు, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటు వేశారు. తుది సంఖ్యలు దిద్దుబాటుకు లోబడి ఉన్నాయని చైర్మన్ జగ్​దీప్​ ధన్కర్ తెలిపారు.

ఎగువ సభ ఈ బిల్లును ఆమోదించడంతో, ఇది ఇప్పుడు అధికారికంగా పార్లమెంటు ఆమోదం పొందింది. ఇ...