భారతదేశం, మార్చి 5 -- Visakha Lands: వైసీపీ హయంలో అమ్మలేకపోయిన భూముల్ని కూటమి ప్రభుత్వంలో విక్రయించేందుకు కొందరు పావులు కదుపుతున్నారు. గతంలో ప్రభుత్వ భూముల్ని విక్రయించడంపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో నాటి ప్రభుత్వం వెనక్కి తగ్గగా ఇప్పుడు అవే భూముల్ని విక్రయించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ వ్యవహారంపై ఫైల్‌ ‌ను ఆగమేఘాలపై నడిపిస్తున్నారు.

విశాఖలో రూ.700కోట్ల ఖరీదు చేసే భూముల్ని పదో వంతు ధరకే విక్రయించే ప్రయత్నాలు మొదలయ్యాయి.ఖరీదైన ప్రభుత్వ భూముల్ని కారు చౌకగా విక్రయించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. కీలక మంత్రి పేషీలో ఉన్న అధికారి అండదండలతో ఈ వ్యవహారం సాగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. భూముల విక్రయానికి సంబంధించిన ఫైల్‌ సిద్ధమై సర్క్యూలేషన్‌లో పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో విశాఖపట్నంలో బెంగుళూరుకు చెందిన ఇంటర...