భారతదేశం, మార్చి 5 -- Visakha Lands: విశాఖపట్నంలో అంతర్జాతీయ విద్యా సంస్థ ఏర్పాటు కోసం వైసీపీ హయంలో భూమిని కేటాయించినా వాటిని అప్పగించ పోవడం చర్చనీయాంశంగా మారింది.

విశాఖలో రూ.700కోట్ల ఖరీదు చేసే భూముల్ని అంతర్జాతీయ విద్యా సంస్థ ఏర్పాటు చేయడం కోసం వైసీపీ ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరను చెల్లించినా భూములను వారికి అప్పగించ లేదు. ఈ క్రమంలో భూకేటాయింపుతో పాటు పలు అంశాలతో మరో ఫైల్‌ సిద్ధం చేసి సర్క్యూలేషన్‌లో పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో విశాఖపట్నంలో బెంగుళూరుకు చెందిన ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు మధురవాడ ప్రాంతంలో భూ కేటాయింపులు జరిగాయి. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు 2023 డిసెంబర్‌ 22న భూ యాజమాన్య హక్కులను బదలాయిస్తూ ఏపీ రెవిన్యూ శాఖ జీవో నంబర్‌ 606 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలోనే...