భారతదేశం, ఫిబ్రవరి 3 -- ఫిబ్రవరి 3వ తేదీన తిరుమలలో జరగాల్సిన టీటీడీ ట్రస్ట్ బోర్డ్ సమావేశం వాయిదా పడింది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో) అనిల్ కుమార్ సింఘాల్ను అకస్మాత్తుగా బదిలీ చేశారు. అదనపు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీహెచ్. వెంకయ్య చౌదరికి బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించే వరకు టీటీడీ ఇంచార్జ్ ఈఓగా వెంకయ్య చౌదరికి బాధ్యతలను అప్పగించింది ప్రభుత్వం.
కొత్తగా నియమితులైన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముద్దాడ రవిచంద్ర ఎప్పుడు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం నుండి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సమావేశాన్ని వాయిదా వేశారు. టీటీడీ బోర్డు మీటింగ్ ఎప్పుడు జరుగుతుందో తెలియాల్సి ఉంది.
ఫిబ్రవరి 3వ తేదీన తిరుమలలో జరగాల్సిన టీటీడీ ట్రస్ట్ బోర్డ్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.