భారతదేశం, మార్చి 11 -- Terrorists attack train: నైరుతి పాకిస్తాన్ లో మంగళవారం ప్యాసింజర్ రైలుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో రైలు డ్రైవర్ గాయపడ్డాడు. ఈ ఘటనతో రైలులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ రైలులో సుమారు 400 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.

బలూచిస్థాన్ నైరుతి ప్రావిన్స్ లోని క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్ కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలుపై ఉగ్రవాదులు దాడి చేశారు. అయితే, డ్రైవర్ తో పాటు ప్రయాణికులపై కూడా ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, టెర్రరిస్ట్ ల కాల్పుల్లో డ్రైవర్ గాయపడగా, పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, సుమారు 100 మందికి పైగా ప్రయాణికులు, సెక్యూరిటీ సిబ్బందిని ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారని...