భారతదేశం, ఫిబ్రవరి 5 -- రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకమండళ్లు కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఇటీవలనే ఎన్నికలు పూర్తి కాగా. సర్పంచ్ లు, ఉపసర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టారు. దీంతో పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయిపోయింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం. గ్రామ పంచాయతీలకు శుభవార్తను చెప్పింది. తొలి విడతగా ఆర్థిక సంఘం నిధుల కింద రూ. 259.36 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం. తెలంగాణకు దాదాపు రూ. 3,000 కోట్లు వచ్చే అవకాశం ఉంది. మొదటి విడత కింద రూ. 259.36 కోట్లును కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులు నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి వెళ్తాయి. మిగిలిన నిధులను దశలవారీగా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్త...