భారతదేశం, మార్చి 10 -- దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 8 పాయింట్లు పడి 74,333 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 8 పాయింట్లు వృద్ధచెంది 22,552 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 130 పాయింట్లు కోల్పోయి 48,497 వద్దకు చేరింది.

"నిఫ్టీ50కి 22400-22300 లెవల్స్​ కీలక సపోర్ట్​గా ఉండొచ్చు. ఈ లెవల్స్​పైన ట్రేడ్​ అయితే నిఫ్టీ 22,750 వరకు వెళ్లొచ్చు. కానీ 22,300 దిగువకు పడిపోతే సెంటిమెంట్​ దెబ్బతినొచ్చు," అని కొటాక్​ సెక్యూరిటీస్​ వైస్​ ప్రెసిడెంట్​ టెక్నికల్​ రీసెర్చ్​ అమోల్​ అథవాలె తెలిపారు.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2035.1 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,320.36 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

మార్చ్​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్ప...