భారతదేశం, ఫిబ్రవరి 7 -- దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 213 పాయింట్లు పడి 78,058 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 93 పాయింట్లు పడి 23,603 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 39 పాయింట్లు పెరగి 50,382 వద్దకు చేరింది.

దేశీయ స్టాక్​ మార్కెట్​లో ఎఫ్​ఐఐలు సెల్లింగ్​ కొనసాగుతోంది. గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3549.95 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2721.66 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఫిబ్రవరి నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 9709.01 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,819.85 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ప్రారంభించే...