భారతదేశం, ఫిబ్రవరి 10 -- దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 198 పాయింట్లు పడి 77,860 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 43 పాయింట్లు పడి 23,560 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 223 పాయింట్లు నష్టపోయి 50,159 వద్దకు చేరింది.

"నిఫ్టీ50కి 23,200 లెవల్స్​ కీలక సపోర్ట్​గా ఉంది. 23900 రెసిస్టెన్స్​గా ఉంది. దీనిపైన బ్రేకౌట్​ అయితే నిఫ్టీ50 24,200 వరకు వెళ్లొచ్చు," అని రెలిగేర్​ బ్రోకింగ్​ ఎస్​వీపీ అజిత్​ మిశ్రా తెలిపారు.

దేశీయ స్టాక్​ మార్కెట్​లో ఎఫ్​ఐఐలు సెల్లింగ్​ కొనసాగుతోంది. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 470.39 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 454.2 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఫిబ్రవరి నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 101...