భారతదేశం, ఫిబ్రవరి 6 -- Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 354 పాయింట్లు కోల్పోయి 71,731 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 82 పాయింట్ల నష్టంతో 21,772 వద్ద ముగిసింది. ఇక 145 పాయింట్ల నష్టంతో 45,826 వద్దకు చేరింది బ్యాంక్ నిఫ్టీ.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 518.88 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1188.68 కోట్లు విలువ చేసే షేర్లను​ విక్రయించారు.

Stock market news today : ఇక దేశీయ సూచీలు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని స్వల్ప నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు నష్టపోయాయి. డౌ జోన్స్​ 0.71శాతం, ఎస్​ అ...