భారతదేశం, సెప్టెంబర్ 30 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 62 పాయింట్లు పడి 80,365 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 20 పాయింట్లు కోల్పోయి 24,635 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 72 పాయింట్లు పెరిగి 54,461 వద్దకు చేరింది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2,805.34 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,690.06 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని సూచీలు ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 10 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50 షార్ట్​ టర్మ్​లో 24,500- 24,850 లెవల్స్​ మధ్య ట్రేడ్​ అవ్వొచ్చు. 24,850 పైన క్లోజ్​ అయితే, సూచీ ఇంకాస్త పెరగొచ్చు," అని ఎల్​కేపీ సెక్యూరి...