భారతదేశం, ఏప్రిల్ 8 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ టారీఫ్​ పిడుగుతో సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ప్రపంచ స్టాక్​ మార్కెట్​లు కుప్పకూలాయి. దేశీయ స్టాక్​ మార్కెట్​లు సైతం భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 2227 పాయింట్లు పడి 73,138 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 743 పాయింట్లు కోల్పోయి 22,162 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 1643 పాయింట్లు పడి 49,860 వద్దకు చేరింది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 9,040.01 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 12,122.45 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 400 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

బ్లాక్​ మండే తర్వాత దేశీయ సూచీలు బే...