భారతదేశం, ఏప్రిల్ 15 -- అంబేడ్కర్​ జయంతి సందర్బంగా స్టాక్​ మార్కెట్​లకు సోమవారం సెలవు. ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1310 పాయింట్లు పెరిగి 75,157 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 429 పాయింట్లు వృద్ధిచెంది 22,828 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 762 పాయింట్లు పెరిగి 51,002 వద్దకు చేరింది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2,519.03 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,759.27 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 400 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50 22,500 ఎగువ ట్రేడ్​ అవుతున్నంత సేపు ట్రెండ్​ పాజిటివ్​గా ఉన్న...