భారతదేశం, ఫిబ్రవరి 6 -- దేశంలోని పలు రాష్ట్రాల్లో ఓటర్ల సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలోనూ ఈ ప్రక్రియ చేపట్టేందుకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుండగా.. తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్‌ ఏప్రిల్‌, -మే నెలల మధ్య వెలువడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను సీఈఓ సుదర్శన్​రెడ్డి పేర్కొన్నారు.

సర్(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను అత్యంత పారదర్శకగా, పకడ్బందీగా నిర్వహించాలని చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి(సీఈవో) సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సర్​ రాష్ట్రంలోని ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు కనీసం ఒక బూత్‌ లెవెల్‌ ఏజెంట్‌ (బీఎల్‌ఏ)ను రాజకీయ పార్టీలు తప్పనిసరిగా నియమించుకోవాలన్నారు.

గురువారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన...