భారతదేశం, అక్టోబర్ 10 -- సెక్యూరిటీస్ అండ్ ఎక్స్​ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆఫీసర్ గ్రేడ్ 'ఏ' (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్​ ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనుంది. ఈ మేరకు నోటిఫికేషన్​ని తాజాగా విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు సెబీ అధికారిక వెబ్‌సైట్ sebi.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా సంస్థలో మొత్తం 110 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రిక్రూట్​మెంట్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వివరాలతో కూడిన అధికారిక ప్రకటన, ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ అక్టోబర్ 30, 2025న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే.. అర్హత, ఎంపిక ప్రక్రియ, ఫీజు తదితర వివరాల కోసం కింద చదవండి.

మొత్తం 110 పోస్టులలో వివిధ విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

సెబీ రి...