భారతదేశం, ఫిబ్రవరి 14 -- ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. హోళీ పండగ సమీపిస్తున్న వేళ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి - షాలిమార్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. మొత్తం 6 సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్ల మీదుగా వెళ్లనన్నాయి.

దక్షిణ మధ్య రైల్వే వివరాల ప్రకారం... చర్లపల్లి - షాలిమార్ (ట్రైన్ నెంబర్ 07512) మధ్య ఫిబ్రవరి 26, మార్చి 1, మార్చి 5వ తేదీలో ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఈ ట్రైన్ ఉదయం 05. 40 గంటలకు చర్లప్లలి నుంచి ప్రారంభమై... మరునాడు ఉదయం 11.20 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది.

ఇక షాలిమార్ - చర్లపల్లి (ట్రైన్ నెంబర్ 07513) మధ్య కూడా ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఫిబ్రవరి 27, మార్చి 2, మార్చి 6 తేదీల్లో అందుబాటులో ఉంటాయి. ఈ ట్రైన్ షాలిమార్ నుంచి మధ్యాహ్నం 12.45 గంటల...