Hyderabad, ఫిబ్రవరి 12 -- Ram Charan: రామ్ చరణ్, టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కలిసి ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోను కైఫ్ మంగళవారం (ఫిబ్రవరి 11) సాయంత్రం షేర్ చేశాడు. ఈ సందర్భంగా చరణ్ తో నాటు నాటు స్టెప్పులు వేయాలని ఉందన్న అతడు.. ఆర్ఆర్ఆర్ స్టార్ పై ప్రశంసలు కురిపించాడు. ఐఎస్పీఎల్ టీ10 ప్రారంభం సందర్భంగా ఈ ఇద్దరూ కలిశారు.
టీమిండియాలో ఒకప్పుడు మెరుపు ఫీల్డర్ గా, మిడిలార్డర్లో నమ్మదగిన బ్యాటర్ గా ఎదిగిన మహ్మద్ కైఫ్.. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను కలిశాడు. ఈ సందర్భంగా అతనితో దిగిన ఫొటోను ట్వీట్ చేశాడు. "అతన్ని కలిసినప్పుడు అతనితో నాటు నాటు స్టెప్ వేయాలని అనుకుంటారు. ఓ పెద్ద గ్లోబల్ సూపర్ స్టార్ కానీ చాలా సింపుల్ గా ఉంటారు. మా అందరినీ మీరు గర్వపడేలా చేశారు. మీకు మరిన్ని హిట్స్ లభించాలని మనస్ఫూర్త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.