భారతదేశం, ఏప్రిల్ 14 -- మలయాళ నటుడు, దర్శకుడు పృథ్విరాజ్ సుకుమార్ వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంటున్నారు. మోహన్‍లాల్ హీరోగా పృథిరాజ్ దర్శకత్వం వహించి ఓ కీలకపాత్ర పోషించిన ఎల్2:ఎంపురాన్ గత నెల విడుదలై బ్లాక్‍బస్టర్ కొట్టింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు - దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‍లో రూపొందుతున్న మూవీలో పృథ్విరాజ్ ఓ ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ఇంతలోనే బాలీవుడ్‍లో మరో చిత్రానికి ఓకే చెప్పేశారు.

బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ ప్రధాన పాత్రలో దార్యా చిత్రం రానుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు మేఘన గుల్జర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో పృథ్విరాజ్ సుకుమారన్ నటించనున్నారంటూ కరీనా నేడు ఇన్‍స్టాగ్రామ్‍ అకౌంట్‍లో వెల్లడించారు. గుల్జర్, పృథ్వితో మాట్లాడుతున్న ఫొటోలను పోస్ట్ చేశారు.

డ్రీమ్ టీమ్ అంటూ ఈ విషయాన్ని పోస్ట్ చేశారు కరీనా క...