భారతదేశం, ఫిబ్రవరి 2 -- భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఒకే ఒక పేరు మార్మోగిపోతోంది.. అదే 'ధురంధర్' (Dhurandhar). థియేటర్లలో సుమారు రూ. 1300 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్ కొల్లగొట్టిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో కూడా ధురంధర్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్‌లో నంబర్ వన్ స్థానంలో నిలవడం విశేషంగా మారింది.

పాకిస్థాన్, మధ్య ప్రాచ్య (Middle East) దేశాల్లో ధురంధర్ సినిమా థియేటర్లలో విడుదల కాలేదని తెలిసిందే. దీంతో ఈ మార్కెట్ల ద్వారా దాదాపు 10 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయినట్లు చిత్ర పంపిణీదారులు గతంలోనే తెలిపారు.

అయితే, జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌లో ధురంధర్ ఓటీటీ రిలీజ్ అయన అతి కొద్ది రోజుల్లోనే పాకిస్థానీయులు ఈ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు. అక్కడి సోషల్ మీడ...