భారతదేశం, ఫిబ్రవరి 3 -- మూడేళ్ల గ్యాప్ తర్వాత నందు హీరోగా వచ్చిన సినిమా 'సైక్ సిద్ధార్థ'. ఓ వైపు సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తూనే, మరోవైపు హీరోగా తన కెరీర్ నిర్మించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు నందు. ఈటీవీలో వస్తున్న ఢీషోలో యాంకర్ గానూ ఆడియన్స్ కు చేరువయేందుకు ట్రై చేస్తున్నాడు. అతని లేటెస్ట్ మూవీ సైక్ సిద్ధార్థ ఒక రోజు ముందే ఓటీటీలోకి వచ్చేసింది.

నందు, యామిని భాస్కర్, ప్రియాంక రెబకా తదితరులు నటించిన మూవీ సైక్ సిద్ధార్థ. న్యూ ఇయర్ స్పెషల్ గా జనవరి 1, 2026న థియేటర్లలో రిలీజైంది ఈ మూవీ. సురేష్ ప్రొడక్షన్ సంస్థ రిలీజ్ చేయడంతో కాస్త హైప్ వచ్చినా రిజల్ట్ మాత్రం పాజిటివ్ గా లేదు. ఇప్పుడీ మూవీ ఆహా వీడియో ఓటీటీలోకి ఇవాళ (ఫిబ్రవరి 3) వచ్చేసింది.

నిజానికి సైక్ సిద్ధార్థ ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిబ్రవరి 4 అని మేకర్స్ ముందే అనౌన్స్ చేశారు. అయితే ఒక రోజు...