భారతదేశం, ఫిబ్రవరి 6 -- ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్‌ను సాధించింది. ఇప్పుడు ఈ మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.

ప్ర‌ముఖ ఓటీటీ మాధ్య‌మం జీ5లో ఫిబ్ర‌వ‌రి 11న మన శంకర వరప్రసాద్ ఓటీటీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి, నయనతార, వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు నెట్టింట్లో చిరంజీవి, నయనతార, వెంకటేష్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. "మన శంకర వర ప్రసాద్ గారు అనేది కుటుంబంలోని బంధాలు, బాంధవ్యాలు గురించి చెప్పిన ఎంట‌ర్‌టైన‌ర్‌. ఈ సినిమాపై థియేటర్లలో ప్రేక్షకులు చూపిన ప్రేమ మాకెంతో ఆనందాన్నిచ్చింది" అని అన్నారు.

"ఇప్పుడు జీ5 ఓటీటీ ద్వారా ఈ సినిమా ...