Hyderabad, ఏప్రిల్ 2 -- OTT Malayalam Thriller Movie: మలయాళం థ్రిల్లర్ మూవీ ఒకటి ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ఏడాదిన్నరగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ దొరక్క డిజిటల్ ప్రీమియర్ కు నోచుకోని ఈ సినిమా పేరు జైలర్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ సమయంలోనే ఈ మూవీ కూడా రిలీజైంది. అయితే బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.

మలయాళం నటుడు ధ్యాన్ శ్రీనివాసన్ నటించిన మూవీ జైలర్. ఇదొక హిస్టారికల్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా ఆగస్ట్, 2023లో థియేటర్లలో రిలీజైంది. మొత్తానికి ఇప్పుడు అంటే ఏప్రిల్ 4 నుంచి మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది.

బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన ఈ మూవీని.. ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ తీసుకోలేదు. ఏడాదిన్నర తర్వాత మనోరమ మ్యాక్స్ ఈ మూవీ హక్కులను సొంతం చేసుకొని స్ట్రీమింగ్ తేదీని బుధవారం (ఏప్రిల్ 2) వెల్లడించింది. సక్కిర మడతిల్ ఈ సినిమాను...