భారతదేశం, మార్చి 31 -- స్టార్ నటి వరలక్ష్మి శరత్‍కుమార్ ప్రధాన పాత్రలో మధుశాల చిత్రం వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి జీ సుధాకర్ దర్శకత్వం వహించారు. మనోజ్ నందం కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్ర చేశారు. ఈ మధుశాల చిత్రం నేడు (మార్చి 31) ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.

మధుశాల సినిమా తెలుగులో నేడు ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. "మధుశాల.. ఓ థ్రిల్లింగ్ కిడ్నాప్ డ్రామా. ఓ ప్లాన్, షాకింగ్ ట్విస్ట్. టైమ్‍తో రేస్. కిడ్నాపర్లను పట్టుకొని, తనకు ఇష్టమైన వ్యక్తిని ఎమ్మెల్యే కాపాడుకున్నాడా?. మధుశాల మూవీని ఈటీవీ విన్‍లో చూసేయండి" అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈటీవీ విన్ ప్లాట్‍ఫామ్.

మధుశాల చిత్రంలో వరలక్ష్మి శరత్‍కుమార్, మనోజ్ నందంతో పాటు యానీ, ఇనయా సుల్తానా, తనికెళ్ల భరణి, రఘుబాబు, రాకెట్ రాఘవ, రఘుబాబు,...