భారతదేశం, ఫిబ్రవరి 1 -- ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి ప్రతి వారం సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. డిఫరెంట్ జోనర్స్, వివిధ భాషల్లో ఈ సినిమాలు, సిరీస్‌లు ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంటాయి. ఈ క్రమంలోనే ప్రతి ఆదివారం అచ్చమైన తెలుగు సినిమా కూడా ఓటీటీ రిలీజ్ అవుతుందన్న విషయం తెలిసిందే.

స్వచ్ఛమైన తెలుగు కథతో ప్రతి ఆదివారం డిఫరెంట్ జోనర్లలో ఓ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తుంటుంది. ఈ విధంగానే ఇవాళ (ఫిబ్రవరి 1) ఓ తెలుగు మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమానే జ్యోతి. తెలుగులో ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రంగా జ్యోతి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

జ్యోతి సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆమని, ప్రముఖ నటుడు శివాజీ రాజాతోపాటు బిగ్ బాస్ అమర్‌దీప్ చౌదరి భార్య, సీరియల్ హీరోయిన్ తేజస్విని గౌడ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ముగ్...