భారతదేశం, మే 7 -- పహల్గామ్​ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్​ 'సిందూర్​' చేపట్టిన భారత సైన్యం.. పాకిస్థాన్​తో పాటు పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఫలితంగా సరిహద్దు వెంబడి ఇప్పటికే ఉన్న ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరాయి. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్​ కాల్పులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో స్పైస్ జెట్ సహా ఇతర విమానయాన సంస్థలు భారతదేశ ఉత్తర భాగంలోని అనేక విమానాశ్రయాలకు సంబంధింంచి అడ్వైజరీలను జారీ చేశాయి. విమానాల రాకపోకలపై ప్రభావం పడుతుందని, ప్రయాణానికి ముందు అప్డేట్స్ చూసుకోవాలని ప్రయాణికులను ఎయిరిండియా, ఇండిగో కోరాయి.

ఎక్స్​లో ఉన్న అప్డేట్స్​ ప్రకారం.. ధర్మశాల, లేహ్, జమ్ము శ్రీనగర్, అమృత్​సర్​లోని విమానాశ్రయాలను తదుపరి నోటీసు వచ్చే వరకు మూసివేస్తున్నట్లు విమానయాన సంస్థలు పేర్కొన్నాయి.

ఆపరేషన్​ సిం...