భారతదేశం, ఏప్రిల్ 23 -- Ontimitta Kalyanam: ఒంటిమిట్టలో సీతారాముల Seetharama కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతారాముల‌ క‌ల్యాణాన్ని తిలకించేందుకు భక్తలు వేల సంఖ్యలో హాజరయ్యారు. స్వామి వారి కళ్యాణోత్సవాలకు kalyanam హాజరైన వారికి TTD టీటీడీ తరపున తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలు, ముత్యంతో కూడిన త‌లంబ్రాల పంపిణీ పంపిణీ చేశారు.

వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి Kodandarama బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జ‌రిగింది. వేలాదిగా హాజరైన భక్తులు స్వామివారి క‌ల్యాణోత్స‌వాన్ని తన్మయత్వంతో తిల‌కించారు.

టీటీడీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 17నుంచి Ontimitta ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. సోబమవారం రాత్రి పున్నమి వెన్నెలలో జరిగిన కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు...