భారతదేశం, మార్చి 5 -- NTR Trust Bhavan: ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను మరింత చేరువచేసేందుకు విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం నిర్మాణాన్ని చేపడుతోంది. భవన నిర్మాణానికి గురువారం నారా భువనేశ్వరి శంకుస్థాపన చేయనున్నారు.

జీ+ప్లస్ 5 విధానంలో ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవన నిర్మాణం చేపడతారు. ఇందులో తలసేమియా కేర్ సెంటర్‌తో పాటు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తారు. సేవా కార్యక్రమాలతో ఆపన్నులకు అండగా నిలుస్తూ సమర్థవంతమైన సేవలు అందిస్తున్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ విజయవాడలో ఏర్పాటుకానుంది.

ఎన్టీఆర్‌ పేరిట ట్రస్ట్ స్థాపించాక హైదరాబాద్ కేంద్రంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాలను ఏపీ ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వీలుగా రాష్ట్రంలో నూతన భవనం నిర్మించబోతున్నారు.

విజయవాడల...