భారతదేశం, సెప్టెంబర్ 13 -- ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఉపసంహరణ సెప్టెంబర్ 15న ప్రారంభమవుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఒకవేళ ఇదే జరిగితే.. రుతుపవనాలు ఇంత ముందుగా తిరోగమించడం గత దశాబ్ద కాలంలోనే ఇదే మొదటిసారి అవుతుంది. గత ఏడాది సెప్టెంబర్ 23న, 2023లో సెప్టెంబర్ 25న రుతుపవనాల ఉపసంహరణ మొదలైంది.
పశ్చిమ రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఐఎండీ ప్రకటించింది. సాధారణంగా సెప్టెంబర్ 17న మొదలయ్యే తిరోగమనం, ఈసారి రెండు రోజుల ముందుగానే ప్రారంభమవుతుందని అంచనా. ఒకవేళ సెప్టెంబర్ 15 నుంచి ఉపసంహరణ మొదలైతే, 2015 తర్వాత (అప్పుడు సెప్టెంబర్ 4న మొదలైంది) ఇదే అత్యంత ముందుగా ప్రారంభమైన తిరోగమనం అవుతుంది. 2016లో కూడా సెప్టెంబర్ 15నే రుతుపవనాల ఉపసంహరణ మొదలైంది. సాధారణంగా దేశవ్యాప్తంగా అక్ట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.