భారతదేశం, మార్చి 22 -- నేడు కర్ణాటక బంద్! మహా నగరం బెంగళూరుతో పాటు అనేక ప్రాంతాల్లో బంద్ తీవ్రత కనిపించే అవకాశం ఉంది. ఉదయం 6 గంటలకు మొదలైన ఈ బంద్.. సాయంత్రం 6 గంటల వరకు, అంటే 12 గంటల పాటు కొనసాగుతుంది.
కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ) కండక్టర్ మరాఠీ మాట్లాడలేదనే కారణంతో ఆయనపై నెల రోజుల క్రితం బెళగావిలో దాడి జరిగింది. ఆ తర్వాత అది భాషపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. ఫలితంగా నేడు కర్ణాటక బంద్కు పిలుపునిచ్చారు.
అయితే సిద్ధరామయ్య నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బంద్కు మద్దతు ఇవ్వదని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ గురువారం ప్రకటించారు. ఇది సరైన చర్య కాదని వారికి (సంస్థలకు) అర్థమయ్యేలా చేస్తామని, ఇది ఇప్పటికే పరీక్షలు ప్రారంభమైన విద్యార్థులపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.
బెళగావి, రాష్ట్రంలోని ఇతర సున్నితమైన ప్రాం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.