భారతదేశం, మార్చి 22 -- నేడు కర్ణాటక బంద్​! మహా నగరం బెంగళూరుతో పాటు అనేక ప్రాంతాల్లో బంద్​ తీవ్రత కనిపించే అవకాశం ఉంది. ఉదయం 6 గంటలకు మొదలైన ఈ బంద్​.. సాయంత్రం 6 గంటల వరకు, అంటే 12 గంటల పాటు కొనసాగుతుంది.

కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ) కండక్టర్ మరాఠీ మాట్లాడలేదనే కారణంతో ఆయనపై నెల రోజుల క్రితం బెళగావిలో దాడి జరిగింది. ఆ తర్వాత అది భాషపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. ఫలితంగా నేడు కర్ణాటక బంద్​కు పిలుపునిచ్చారు.

అయితే సిద్ధరామయ్య నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బంద్​కు మద్దతు ఇవ్వదని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ గురువారం ప్రకటించారు. ఇది సరైన చర్య కాదని వారికి (సంస్థలకు) అర్థమయ్యేలా చేస్తామని, ఇది ఇప్పటికే పరీక్షలు ప్రారంభమైన విద్యార్థులపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.

బెళగావి, రాష్ట్రంలోని ఇతర సున్నితమైన ప్రాం...