Hyderabad, ఏప్రిల్ 29 -- Jr NTR Dinner: వార్ 2 మూవీతో జూనియర్ ఎన్టీఆర్ తన బాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్న విషయం తెలుసు కదా. ఈ మూవీ షూటింగ్ కోసమే కొన్నాళ్ల కిందట ముంబై వెళ్లిన తారక్.. అక్కడి స్టార్లతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. బాలీవుడ్ తారలతో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్.. ఆదివారం (ఏప్రిల్ 28) రాత్రి అక్కడి స్టార్లతో కలిసి డిన్నర్ చేయడానికి వెళ్లాడు.

ముంబైలో నైటౌట్లు, పార్టీలు కామనే. అయితే హైదరాబాద్ లో ఉన్నప్పుడు చాలా వరకూ ఇలాంటి వాటికి దూరంగా ఉండే జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు ముంబై వెళ్లిన తర్వాత వాటికి అలవాటు పడ్డట్లున్నాడు. తాజాగా ఆదివారం (ఏప్రిల్ 28) రాత్రి బాలీవుడ్ స్టార్లు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, హృతిక్ రోషన్, సబా ఆజాద్, కరణ్ జోహార్ లతో కలిసి జూనియర్ ఎన్టీఆర్, అతని భార్య లక్ష్మి ప్రణతి డిన్నర్ కు వెళ్లారు.

ఈ అరుదైన ఫొటోల ...