భారతదేశం, డిసెంబర్ 6 -- Jharkhand crime news : ఝార్ఖండ్​లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా సాగుతున్న భూ వివాదం.. చివరికి ఓ కుటుంబంలో తీవ్ర దుఖాన్ని మిగిల్చింది. 20ఏళ్ల వ్యక్తి.. తన బంధువును కిడ్నాప్​ చేసి హత్య చేశాడు. అక్కడే ఉన్న అతని స్నేహితులు.. మృతుడి తలతో సెల్ఫీలు దిగారు!

దసాయ్​ ముండా అనే 55ఏళ్ల వ్యక్తి.. తన కుటుంబంతో కలిసి కుంటి జిల్లాలోని ముర్హులో నివాసముంటున్నాడు. అతనికి సాగర్​ ముండా అనే పేరుతో బంధువు ఉన్నాడు. ఈ రెండు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా భూవివాదం నడుస్తోంది.

కాగా.. ఈ నెల 1వ తేదీన.. పొలం పనుల కోసం దసాయ్​ ముండా కుటుంబం బయటకు వెళ్లింది. అతని కుమారుడు కాను ముండా ఒక్కడే ఇంట్లో ఉండిపోయాడు. దసాయ్​ ముండా తిరిగి ఇంటికి వెళ్లేసరికి కొడుకు కనిపించలేదు.

Man beheads cousin : కాను ముండాను 20ఏళ్ల సాగర్​ ముండా కిడ్నాప్​ చే...