భారతదేశం, ఫిబ్రవరి 4 -- హైదరాబాద్ న‌గ‌రంలో అగ్ని ప్ర‌మాదాల నివార‌ణ‌కు హైడ్రా అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించింది. నాంప‌ల్లిలోని ఫ‌ర్నీచ‌ర్ షోరూంలో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదంతో పాటు.. న‌గ‌రంలో జ‌రిగిన ప‌లు ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో న‌గ‌ర ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంది.

ఫైర్‌సేఫ్టీ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన‌ట్టు ఇటీవ‌ల జ‌రిగిన త‌నిఖీల్లో వెల్ల‌డైన త‌ర్వాత‌.. పెద్ద‌ ఎత్తున అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల్సిన అవ‌స‌రాన్ని హైడ్రా గుర్తించింది. ఫైర్ సేఫ్టీ నిబంధ‌న‌లు తూచా త‌ప్ప‌కుండా పాటించేందుకు నెల రోజులు గ‌డువు ఇస్తూనే.. అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను కూడా హైడ్రా చేప‌ట్టింది.

అగ్ని ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి..? ఒక వేళ అగ్ని ప్ర‌మాదం జ‌రిగితే ఎలా మంట‌ల‌ను అదుపులోకి తీసుకురావాలి. ప్రాణ‌, ఆస్తి న‌ష్టాల‌న...