భారతదేశం, మార్చి 28 -- Heeramandi OTT Release Date: బాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'హీరామండి: ది డైమండ్ బజార్' వెబ్ సిరీస్ రానుంది. ఆయన ఈ సిరీస్‍ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని రూపొందిస్తున్నారు. కొన్ని అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన భన్సాలీ.. ఈ సిరీస్‍తో ఓటీటీలోనూ ఎంట్రీ ఇస్తున్నారు. రెండేళ్ల క్రితమే షూటింగ్ మొదలైన 'హీరామండి' ఆలస్యమవుతూ వస్తోంది. అయితే.. ఇప్పుడు ఎట్టకేలకు ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.

హీరామండి వెబ్ సిరీస్ ఈ ఏడాది మే 1వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. చాలాకాలం సందిగ్ధత తర్వాత ఎట్టకేలకు ఈ సిరీస్ రిలీజ్ డేట్ ఖరారైంది. మే 1న ఈ సిరీస్ రానుందని నెట్‍ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.

హీరామండి వెబ్ సిరీస్‍లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరి, రిచా చద్దా, సంజీ...