భారతదేశం, ఏప్రిల్ 12 -- భారీ ఉష్ణోగ్రతల అనంతరం కురిసిన వర్షాలతో దేశ రాజధాని దిల్లీలోని ప్రజలు శుక్రవారం కాస్త ఊపిరిపీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం కూడా ఉరుములు, మెరుపులు, బలమైన ఉపరితల గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని దిల్లీ ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఏప్రిల్ 12న ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కానీ రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతాయని స్పష్టం చేసింది. ఏప్రిల్ 16 నుంచి దిల్లీలో హీట్వేవ్ పరిస్థితి కనిపిస్తుందని, వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
శుక్రవారం సాయంత్రం దేశ రాజధానిని భారీ దుమ్ము తుపాను, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పలకరించాయి. ఈ తాకిడికి పలు చెట్లు నేలకూలాయి. దీనికి తోడు ఈదురుగాలుల ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్కు తీవ్ర అంత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.