భారతదేశం, ఏప్రిల్ 4 -- HCU Lands Updates: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ పరిధిలో ఉన్న 400 ఎకరాల భూముని ఏపీఐఐసీకి అప్పగించే వ్యవహారంలో గురువారం కీలక పరిణమాలు చోటు చేసుకున్నాయి. కంచ గచ్చిబౌలిలో జరిగిన పరిణామాలపై హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన నివేదికతో తక్షణం చెట్ల తొలగింపు ఆపాలని సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది.

హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్శిటీ భూముల వ్యవహారం గురువారం అనూహ్య మలుపు తిరిగింది. సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడం, మూడ్రోజుల్లో వంద ఎకరాల్లో చెట్లను నరికి వేశారనే నివేదిక నేపథ్యంలో సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు తేలితే చీఫ్‌ సెక్రటరీ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది.

గురువారం ఉదయం సుప్రీం కోర్టులో అటవీ పర్యావరణ అంశాలకు సంబంధించిన గోదా వర్మన్‌ తిరుమల్ పాడ్‌ కేసులో సు...