భారతదేశం, ఏప్రిల్ 11 -- దేశంలో బంగారం ధరలు శుక్రవారం అత్యంత భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 2940 వృద్ధి చెంది.. రూ. 93,415కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 9,34,150గా ఉంది.

మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 2700 పెరిగి.. రూ. 85,635కి చేరింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 8,56,350కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 8,563గా కొనసాగుతోంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 85,783గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 93,563గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 85,635 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 93,415గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 85,631గాను, ...