భారతదేశం, ఏప్రిల్ 8 -- దేశంలో బంగారం ధరలు దిగొస్తున్నాయి. మంగళవారం సైతం పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 280 తగ్గి.. రూ. 90,395కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 2800 దిగొచ్చి.. రూ. 9,03,950గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 9,039గా ఉంది.
మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 250 దిగొచ్చి.. రూ. 82,865కి చేరింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 2500 తగ్గి, రూ. 8,28,650కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 8,286గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 82,013గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 90,543గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 82,865 పలుకుతోంది. 24 క్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.