భారతదేశం, మార్చి 22 -- దేశంలో బంగారం ధరలు శనివారం దిగొచ్చాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 460 తగ్గి.. రూ. 90,235కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 90,695గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 460 దిగొచ్చి.. రూ. 9,02,3500గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 9,023గా ఉంది.

మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 420 తగ్గి.. రూ. 82,715కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 83,135గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 4200 తగ్గి, రూ. 8,27,150కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 8,271గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 82,863గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 90,383గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి...