భారతదేశం, ఫిబ్రవరి 14 -- దేశంలో బంగారం ధరలు రోజురోజుకు ఆల్​-టైమ్​ హై మార్క్​ని తాకుతూనే ఉన్నాయి. శుక్రవారం సైతం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 వృద్ధి చెంది.. రూ. 87,060కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 87,050గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 8,70,600గా ఉంది.

మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 79,810కి చేరింది. గురువారం ఈ ధర రూ. 79,800గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 7,98,100కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 7,981గా కొనసాగుతోంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 79,960గాను.. 24 క్యారెట్ల బంగారం ధ...