భారతదేశం, మార్చి 18 -- దేశంలో బంగారం ధరలు మంగళవారం తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 110 తగ్గి.. రూ. 89,575కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 87,685గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 1100 దిగొచ్చి.. రూ. 8,95,750గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 8,957గా ఉంది.

మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 82,115కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 82,215గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1000 తగ్గి, రూ. 8,21,150కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 8,215గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 82,263గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,723గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి...