భారతదేశం, ఫిబ్రవరి 3 -- దేశంలో బంగారం ధరలు ఆల్​ టైమ్​ హై దగ్గర కొనసాగుతున్నాయి. కాగా సోమవారం పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 77,440కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 77,450గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి.. రూ. 7,74,400గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 7,744గా ఉంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 దిగొచ్చి.. రూ. 84,480గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 84,490గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి రూ. 8,44,800గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 8,448 ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 77,600గాను.. 24 క్యారెట్ల బంగారం ధర ...