భారతదేశం, ఏప్రిల్ 4 -- Fire Accident: ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున సెకండ్‌ బ్లాక్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న బ్యాటరీ రూమ్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇన్వర్టర్ బ్యాటరీలు కాలి బూడిదయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఫైర్‌ అలారంలు మోగలేదు. దీంతో విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది ప్రమాదాన్ని గుర్తించ లేకపోయారు.

తెల్లవారు జామున బ్యాటరీ రూమ్‌లో పొగలు వస్తుండటాన్ని గుర్తించిన సచివాలయ భద్రతా సిబ్బంది వాటిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.శుక్రవారం ఉదయం 06.30కు మంటల్ని గుర్తించారు. సెకండ్ బ్లాక్‌ గ్రౌండ్ ఫ్లోర్ ‌లో ఉన్న ప్రధాన విద్యుత్తు ప్యానెల్ గదిలో షార్ట్ సర్క్యూట్ అవడం వలన ఫైర్ ఆక్సిడెంట్ జరిగినట్టు గుర్తించారు.

ఈ ప్రమాదంలో సుమారు 300 ఇన్వర్టర్ బ్యాటరీ లు కాలిపోయినట్లు గుర్తించారు. అగ్ని ప్రమాదాన్ని ముందుగా గమనిం...